Saturday, February 28, 2009

బెల్లం జిలేబి

కావాల్సినవి:
మైదా- 600 గ్రా
సోడా-అర టీ స్పూన్
పెరుగు-ఒక కప్పు
బెల్లం-1 1/4 కే జి
తయారు చేసే విధానం:
1 ) ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాకి చిటికెడు సోడా,పెరుగుకలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టండి.ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి,కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా (అంటే చపాతీ పిండి కంటే జారుడుగా) చేసి పన్నెండు గంటలు నానబెట్టాలి.ఇలా చేస్తే పిండి బాగా పులుస్తుంది.
2 ) బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చేయండి.పాకం లేతగా ఉండగానే దించండి.
3 ) ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత -పిండిని గట్టి జిలేబీ వస్త్రంలో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పండి.వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి తీస్తే తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.
4 ) పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం చేయండి. దీన్ని దారంతో బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుడితే జిలేబి వస్త్రం తయారవుతుంది. ........

No comments:

Post a Comment